ఇప్పుడంతా కెమికల్ మయమైంది. ప్రతి కూరగాయలో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి జరిగే హాని అంతా.. ఇంతా కాదు. అందుకే ప్రభుత్వాలు సైతం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి.
ఒకప్పుడు రైతులు సేంద్రీయ వ్యవసాయ పంటలనే పండించే వారు. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయం పూర్తిగా మరుగునపడింది. ఎక్కడో ఒకచోట మాత్రమే ఈ సేంద్రీయ పద్దతిలో పంటలను పండిస్తున్నారు. కెమికల్స్ వాడకానికి అలవాటు పడిన ఎంతో మంది రైతులు మాత్రం ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపడం లేదు.
కానీ కెమికల్స్ ద్వారా పండించిన పంటలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల వంద ఏండ్లు బతకాల్సిన వాడు యాబై నలబై ఏండ్లకే వివిధ రోగాలొచ్చి చనిపోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది.
సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో పెద్దగా రిస్క్ ఉండదు. పంట దిగుబడి తక్కువగా వచ్చినా.. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది రైతులు మళ్లీ ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు.
మీకు తెలుసా.. మనం కొనుగోలు చేస్తున్న కూరగాయల్లో 90 శాతం పూర్తిగా కెమికల్స్ తో నిండిపోయినవే ఉంటున్నాయి. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు భూతల్లి సారం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రస్తుత కాలంలో సేంద్రీయ వ్యవసాయం కాస్త వెలుగులోకి వస్తున్నప్పటికీ ఈ వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తున్నది మాత్రం ధనవంతులే. సాధారణ రైతులు మాత్రం ఈ వ్యవసాయం వైపు అడుగులు వేయడం లేదు. దీనికి కారణం వారికి ఈ వ్యవసాయంపై అవగాహన లేకపోవడం. ముఖ్యంగా ఈ పద్దతిలో పంటలను పండించడం రిస్క్ తో కూడుకున్నదని భావించడం. కాబట్టి ఈ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.
సేంద్రీయ కూరగాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..