ఢిల్లీ మెట్రోలో సీటు కోసం మహిళల గొడవ.. తోసుకుంటూ, తిట్టుకుంటూ.. వీడియో వైరల్..

By SumaBala BukkaFirst Published Aug 16, 2023, 12:36 PM IST
Highlights

ఢిల్లీ మెట్రోలో మహిళలు సీటుకోసం గొడవపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఢిల్లీ : ఢిల్లీ మెట్రో వరుస ఘటనలతో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చుట్టూ ప్రయాణికులున్నారన్న స్పృహ లేకుండా చేసే పనులతో.. వాటికి సంబంధించిన వీడియోలతో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది ఢిల్లీ మెట్రో.. తాజాగా ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు సీటు కోసం పోట్లాడుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. సీటుకు సంబంధించిన వివాదంపై ఇద్దరు మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ, గట్టిగా అరుచుకున్నారు. ఒకరినొకరు దుర్భాషలాడుకోవడంతో సహ ప్రయాణీకులు షాక్‌ అవుతున్నారు. 

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు కలకలం.. ఎక్కడంటే ?

ఈ వీడియోలో, పింక్ సూట్ ధరించిన ఒక మహిళ నలుపు రంగు సూట్‌లో ఉన్న ఇతర మహిళను రెచ్చగొట్టే మాటలు అంటోంది. పోరాటానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. అయితే నలుపు రంగులో ఉన్న మహిళ ఇతర మహిళను కొద్దిగా కదలమని కోరినట్లు వీడియో సూచిస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ తిట్టిపోస్తున్నారు. మహిళలకు పూర్తిగా ఒక భోగీ ఇచ్చారు. మిగతావాటిల్లో కూడా ప్రతీ బోగిలో 8 సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు. అయినా సీట్లు సరిపోవడం లేదు వీళ్లకు అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. 

ఇంతకుముందు, ఢిల్లీ మెట్రోలో ముద్దులు పెట్టుకునే వీడియోలు.. హస్తప్రయోగం వీడియోలు, రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోతో మరోసారి ఢిల్లీ మెట్రో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

click me!