బస్సులో కిరాణా షాపులు.. వ్యాన్ లో ఏటీఎంలు.. ఖమ్మంలో వినూత్న ప్రయోగం..

Apr 16, 2020, 5:04 PM IST

ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ‌ అజ‌య్ సొంత‌ నియోజ‌క‌వ‌ర్గమైన ఖమ్మంలో వినూత్న ప్రయోగం చేశారు. హాట్ స్పాట్ జోన్లలోని వారికోసం ఆర్టీసీ బస్సులో నిత్యావసరాలు తీసుకెళ్లి అక్కడిక్కడే విక్రయిస్తున్నారు. అలాగే ఓ వ్యాన్ లో మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసి ఏటిఎం సౌకర్యాన్నీ అందిస్తున్నారు. దీంతో పాటు 3వి సేఫ్ టన్నెల్ ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని వారికి సేవలందిస్తున్నారు.