Oct 1, 2019, 9:11 PM IST
తెలంగాణ రాజ్భవన్ తో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఆడపడుచులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాదం కలిపారు. మహిళలతో కలిసిపోయిన ఆమె ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళాలోకానికే కాదు యావత్ ప్రజానికానికి ఆమె మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.