తెలంగాణకు హరితహారం : అడవిని తలపిస్తున్న కరీంనగర్ కమీషనరేట్...

May 25, 2020, 11:31 AM IST

తెలంగాణకు హరితహారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వేసిన మొక్కలు ఇప్పుడు అడవిని తలపిస్తున్నాయి. మియావాకీ పద్ధతిలో ఎకరా స్థలంలో 12వేల 5 వందల స్థానిక జాతుల మొక్కలను పెంచుతున్నారు. కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ను ఆకుపచ్చఅడవిగా మార్చేశాయి. 2019లో నాటిన మొక్కలు ఒక్క ఏడాదిలోనే అడవిలా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.