తెలంగాణ సివిల్స్ విజేతలకు మంత్రి హరీష్ అల్పాహారవిందు

తెలంగాణ సివిల్స్ విజేతలకు మంత్రి హరీష్ అల్పాహారవిందు

Published : Jun 01, 2022, 02:57 PM IST

హైదరాబాద్: సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆలిండియా సర్వీసులకు ఎంపికయిన తెలంగాణ యువతీయువకులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. 

హైదరాబాద్: సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆలిండియా సర్వీసులకు ఎంపికయిన తెలంగాణ యువతీయువకులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ (బుధవారం) ఉదయం హైదరాబాద్ లోని తన నివాసానికి సివిల్స్ ర్యాంకర్లను ఆహ్వానించిన మంత్రి వారికి అల్పాహారవిందు ఇచ్చారు. సివిల్స్ ర్యాంకర్లతో కలిసే మంత్రికూడా టిఫిన్ చేస్తూ సరదాగా ముచ్చటించారు. 

హైదరాబాద్ లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో ర్యాంకర్లు హరీష్ రావును కలిశారు. ర్యాంకర్లను మంత్రి ఘనంగా సత్కరించారు. సివిల్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించడంద్వారా వీరు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత హైదరాబాద్ లో ఐఏఎస్ శిక్షణ సంస్థ ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని మంత్రి హరీష్ అభినందంచారు. 

10:23సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వైభవంగా సీతారాముల కళ్యాణం | Sitaramula Kalyanam Bhadrachalam
37:22భద్రాచలం సీతారామ కళ్యాణంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Bhadrachalam Sri Ramanavami
17:45ఘనంగా భద్రాద్రిలో సీతారాముని కళ్యాణం: Sita Rama Kalyanam Celebrations at Bhadrachalam
10:53హైదరాబాద్ లోని రామకోటిలో ఘనంగా శ్రీరామనవమి: Sri Rama Navami Hyderabad| Asianet News Telugu
03:20Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
17:40అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
52:11Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
03:18పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? | Asianet News Telugu
05:10Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
04:31పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu