జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం... కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Apr 22, 2021, 6:20 PM IST


కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ విదానానికి ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి నిర్ణయంతో ఉద్యోగ నియామకాలకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు పేర్కొన్నారు. నూతన జోనల్ విధానం ద్వారా రాష్ట్రంలో 95%  ఉద్యోగాలు స్థానిక యువతి యువకులకే దక్కనున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 

కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలుబడిన నేపథ్యంలో కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

telangana, karimnagar, kcr, new zonal system, తెలంగాణ వార్తలు, తెలంగాణ జోనల్ విధానం, కరీంనగర్, తెలంగాణ విద్యార్థి విభాగం