తెలంగాణలో మరో మెడికో సూసైడ్ ... నిజామాబాద్ లో కలకలం

Mar 31, 2023, 6:25 PM IST

నిజామాబాద్ : ఎంబిబిఎస్ విద్యార్థుల ఆత్మహత్య తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి దాసరి హర్ష ఆత్మహత్యను మరిచిపోకముందే తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్(21) హాస్టల్లో వుంటూ మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఏమయ్యిందో తెలీదు హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని సనత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.