Jun 12, 2020, 7:45 PM IST
హైదరాబాద్: టీవీ5 న్యూస్ చానెల్ జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి పై విచారణ జరిపి అతనికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించిన బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు సికింద్రాబాదులోని చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మనోజ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.