Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం

Oct 10, 2021, 12:13 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ మరింత సీరియస్ గా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. జమ్మికుంట మండలం శాయంపేటకు బిజెపి పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న జమునకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మహిళలు కోలాటాలతో, మంగళహారతులతో జమునకు స్వాగతం పలికారు.