జగిత్యాల: మంటల్లో చిక్కుకుని... పొలంలోనే అన్నదాత దుర్మరణం

Dec 8, 2021, 5:59 PM IST

జగిత్యాల గ్రామీణ మండలం వెల్దుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన పొలంలోని వరి గడ్డికి అంటుకున్న మంటలను ఆర్పడానికి ప్రయత్నించే క్రమంలో రైతు కూడా మంటల్లో చిక్కుకున్నాడు దట్టమైన పొగ వ్యాపించడంతో ఒక్కసారిగా లక్ష్మయ్య కుప్పకూలగా అతడి శరీరానికి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఎవరు కాపాడేవారు లేకపోవటంతో లక్ష్మయ్య మంటల్లో కాలి మృతి చెందాడు. జగిత్యాల రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.