కరోనా కలకలం : కరీంనగర్ లో మరో వ్యక్తికి..హైదరాబాద్ కి తరలింపు...

Mar 19, 2020, 5:36 PM IST

కరీంనగర్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా దేవిశ్రీ గార్డెన్ ప్రాంతంలో కరోనా సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తిని హైదరాబాద్ కు తరలించారు. నిన్న ఒక్కరోజై కరీంనగర్ లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ప్రజలెవ్వరూ బైటికి రావద్దని సూచనలిచ్చారు. నిర్బంధవైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.