
భారత క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న 14 ఏళ్ల యువ బ్యాటింగ్ ప్రతిభావంతుడు వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైభవ్ను బీసీసీఐ కూడా అభినందించింది.