జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామిపై.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి..!

Apr 23, 2020, 12:14 PM IST

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళుతుంటే దాడి జరిగిందంటూ ఆర్నబ్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని, సోనియా గాంధీ పిరికిపంద అని అందుకే నా మీద దాడి జరిగిందని, దీనికి మీరే బాధ్యత అని ఆయన ఆరోపించారు.