విశాఖపట్నం : పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం జరగనివ్వకుండా పోర్ట్ స్టేడియం వద్ద వైసిపి నేతలు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం : పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం జరగనివ్వకుండా పోర్ట్ స్టేడియం వద్ద వైసిపి నేతలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనకుండా పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. శనివారం విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసిపి నేతల కార్లపై జనసైనికులు రాళ్ళ దాడి చేశారు. మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై కర్రలు, రాళ్లతో జనసైనికులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖ గర్జన ముగించుకొని ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.