ఏపీ రాజధాని పులివెందుల, విజయవాడ కూడా కావచ్చు...: మంత్రి మేకపాటి సంచలనం

Aug 31, 2021, 6:23 PM IST


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై వివాదం కొనసాగుతున్న సమయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎక్కడుంటే అదే రాజధాని... అది విజయవాడ, పులివెందుల కూడా కావచ్చు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్..అదే రాజధాని. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాం అని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.