జోరువానలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

Oct 6, 2022, 1:02 PM IST

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలు ముగిసినా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే వుంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు, భవానీ దీక్షదారులు దుర్గమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ అధికారులు వర్షం కారణంగా భక్తులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులు తొందరగా అమ్మవారిని దర్శించుకునేలా చూస్తున్నారు.