సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.