ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్, డిజిపి భేటీ... కీలక అంశాలపై చర్చ

Feb 11, 2021, 12:33 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి ప్రభుత్వానికి, ఎస్ఈసి మధ్య ప్రతి విషయంలోనూ వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాధ్ దాస్, రాష్ట్ర డిజిపి  గౌతమ్ సవాంగ్ గురువారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలిశారు. పంచాయితీ ఎన్నికలు, భద్రతా ఏర్పాటు, ఎదురవుతున్నసమస్యలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.