కాణిపాకం వినాయకుని ఆలయం వద్ద అగ్నిప్రమాదం (వీడియో)

By Siva KodatiFirst Published Sep 10, 2019, 12:39 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. 

చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి.

"

హోటల్‌లోని నెయ్యి డబ్బాలకు మంటలు అంటుకోవడంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

"

హోటల్‌లో ఉన్న గ్యాస్ సీలిండర్లను బయటకు తరలించారు. ఈ సంఘటనతో భక్తులు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. 


 

click me!