ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ తీర్పు: లంచ్ మోషన్ దాఖలు చేసిన కేసీఆర్ సర్కార్

By narsimha lodeFirst Published Feb 7, 2023, 11:59 AM IST
Highlights

ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసులో  సింగిల్ బెంచ్  ఆర్డర్ ను  మూడు వారాల పాటు  సస్పెన్షన్  చేయాలని కోరుతూ   అడ్వకేట్  జనరల్  లంచ్ మోషన్  పిటిషన్ దాఖలు  చేశారు. 

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో   సింగిల్  బెంచ్ ఆర్డర్ ను మూడు వారాల పాటు సస్పెన్షన్  చేయాలని కోరుతూ  హైకోర్టు సింగిల్ బెంచ్ లో  పిటిషన్ దాఖలు  చేశారు  అడ్వకేట్ జనరల్.   సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇవ్వాలని  ఆ పిటిషన్ లో  అడ్వకేట్ జనరల్ కోరారు.   సుప్రీంకోర్టుకు  వెళ్లే వరకు  ఈ ఆర్డర్ పై  స్టే ఇవ్వాలని  అడ్వకేట్  జనరల్   ఆ పిటిషన్ లో  ప్రస్తావించారు.   ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను  హైకోర్టు సింగిల్ బెంచ్  విచారణకు స్వీకరించింది.  ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు  ఈ పిటిషన్ పై  హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ నిర్వహించనుంది. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను  సీబీఐకి అప్పగిస్తూ  సింగిల్ బెంచ్  ఉత్తర్వులను  డివిజన్ బెంచ్ లో  కేసీఆర్ సర్కార్  ఈ ఏడాది జనవరి  4వ తేదీన  సవాల్  చేసింది. ఈ పిటిషన్ పై  నిన్న  హైకోర్టు  డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించింది.  హైకోర్టు సింగిల్ బెంచ్  ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్  కూడా సమర్ధించింది.  

సింగిల్ జడ్జి  పరిధిలోని క్రిమినల్ కేసుల విచారణ తమ పరిధిలోకి  రాదని  నిన్న  డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ విషయమై  ఏదైనా ఉంటే  సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు డివిజన్ బెంచ్   నిన్న  అడ్వకేట్ జనరల్  కు సూచించింది.  అయితే  తాము ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లే వరకు  తీర్పు అమలును నిలిపివేయాలని  అడ్వకేట్  జనరల్  కోరారు. కానీ ఇందుకు   హైకోర్టు డివిజ్  బెంచ్ నిరాకరించింది . 

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును సీబీఐ విచారణకు  అప్పగిస్తూ  2022 డిసెంబర్  26వ తేదీన  తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.  తాము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు  ఈ ఆర్డర్ పై సస్పెన్షన్ ను విధించాలని  తెలంగాణ హైకోర్టును  అడ్వకేట్ జనరల్  కోరారు.  లంచ్ మోషన్ పిటిషన్ లో ఇదే విషయాన్ని కోరారు.   ఇవాళ మధ్యాహ్నం  ఈ పిటిషన్ పై హైకోర్టు సింగిల్  బెంచ్  విచారణ నిర్వహించనుంది.  

click me!