US Open: మిక్స్ డ్ డబుల్స్ లోనూ సానియా జోడికి నిరాశ..!

By telugu news teamFirst Published Sep 4, 2021, 7:59 AM IST
Highlights

మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రాజీవ్ రామ్ జోడి తొలి రౌండ్ లోనే వెను దిరిగింది.

ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్  అయిన యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు మరోసారి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ బరిలోకి కోకో వాండేవ్ తో కలిసి పోటీలోకి దిగిన సానియా మీర్జా.. తొలి రౌండ్ లో ఓటమి పాలైంది. అయితే.. మిక్స్ డ్ డబుల్స్ లో అయినా.. సానియా తన సత్తా చాటకపోతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. అక్కడ కూడా నిరాశే ఎదురవ్వడం గమనార్హం.

మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రాజీవ్ రామ్ జోడి తొలి రౌండ్ లోనే వెను దిరిగింది. క్వెటా పెష్కే ,  కెవిన్ క్రావిట్జ్‌ల తో పోటీ పడి.. తొలి రౌండ్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో.. ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!