Ostrava Open: ఫైనల్స్ కు దూసుకెళ్లిన సానియా మీర్జా-షుమె జాంగ్ ద్వయం

By team teluguFirst Published Sep 25, 2021, 5:52 PM IST
Highlights

Ostrava Open: ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500  టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షుమె జాంగ్ (చైనా) ల జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. 

భారీ టోర్నీల్లో క్వాలిఫైయర్, క్వార్టర్స్ మ్యాచ్ లలోనే వెనుదిరిగే భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా (sania mirza) ఒస్ట్రావా ఓపెన్ లో  ఆ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. చైనా  టెన్నిస్ క్రీడాకారిణి షుమె జాంగ్ (Shuai Zhaung) తో కలిసి ఆడుతున్న ఆమె.. ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. 

 

Sania Mirza 🇮🇳 and Shuai Zhang 🇨🇳 defeat Eri Hozumi and Makoto Ninomiya of 🇯🇵 (6-2, 7-5) in the semifinals of the Ostrava Open and qualify for the finals 🙌 pic.twitter.com/oMLfSbL6we

— Sportskeeda India (@Sportskeeda)

సానియా మీర్జా-షుమె జాంగ్ ల ద్వయం.. శనివారం చెక్ రిపబ్లిక్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో  ఎరి హజుమి-మకొటొ నినొమియా (జపాన్) జంటపై ఘన విజయం సాధించింది. మహిళల డబుల్స్ లో భాగంగా సానియా జోడీ 6-2, 7-5  తేడాతో హజుమి జోడీని మట్టికరిపించింది. వరుస సెట్లలో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన సానియా ద్వయం దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది.

click me!