రైలు పట్టాలపై జహీరాబాద్ బీఆర్ఎస్ నేత మృతదేహాం.. అసలేం జరిగిందంటే..

Published : Jun 10, 2023, 10:22 AM IST
రైలు పట్టాలపై జహీరాబాద్ బీఆర్ఎస్ నేత మృతదేహాం.. అసలేం జరిగిందంటే..

సారాంశం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేత దాసరి లక్ష్మారెడ్డి శుక్రవారం నగర శివార్లలోని శంకర్‌పల్లి స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేత దాసరి లక్ష్మారెడ్డి శుక్రవారం నగర శివార్లలోని శంకర్‌పల్లి స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. లక్ష్మారెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆయనను ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, లక్ష్మారెడ్డి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని అల్లీపూర్. లక్ష్మారెడ్డి గతంలో జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

శంకర్‌పల్లి స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం పడి ఉండడాన్ని రైల్వే సిబ్బంది గమనించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అక్కడ కారు కీ దొరికింది. కీని ఉపయోగించి స్టేషన్ బయట కారు పార్క్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తద్వారా ప్రాథమికంగా మృతదేహం లక్ష్మా రెడ్డిదేనని గుర్తించారు.

అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన ఎలాంటి ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబ సమస్యలు లేవని పోలీసులకు తెలిపారు. త్వరలో వస్తానని చెప్పి గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని భార్య అనిత పోలీసులకు తెలిపారు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహమైంది.

ఇక, దాసరి లక్ష్మారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అల్లిపూర్‌లో శుక్రవారం నిర్వహించారు. అంతిమ కార్యక్రమాలకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కె మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మైన్ ఎం శివకుమార్ తదితరులు హాజరై.. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!