జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం.. : ఏప్రిల్ 10న అఖిలపక్ష సమావేశానికి షర్మిల పిలుపు

Published : Apr 03, 2023, 03:55 PM IST
జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం.. : ఏప్రిల్ 10న అఖిలపక్ష సమావేశానికి షర్మిల పిలుపు

సారాంశం

Hyderabad: "నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా T-SAVE ద్వారా పోరాటం చేద్దాం. రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పిలుపునిచ్చారు.  

YSRTP chief Y S Sharmila: రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ఉమ్మడి పోరాటానికి వీలు కల్పించే రాజకీయ వేదిక, ప్రతిపక్ష పార్టీల సభ్యుల కోసం ఒక కమిటీని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ప్రతిపాదించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేయాలని కోరుతూ ఆమె ఆదివారం తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నేతలకు లేఖలు రాసిన నేపథ్యంలో రాజకీయ వేదిక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యావంతులైన యువత కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి తమ నిబద్ధతను చాటుకునేందుకు 'టీ-సేవ్: తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వెకెన్సీస్, ఎంప్లాయిమెంట్' ఉమ్మడి వేదిక అవుతుందని షర్మిల అన్నారు. విధివిధానాలు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 10న జరిగే సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని, టీ-సేవ్ కు తుది రూపం ఇవ్వాలన్నారు. నిస్వార్థ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్ర సాధనకు బాటలు వేసిన యువత కోసం ఐక్యంగా నడవాల్సిన సమయం ఆసన్నమైందని బలంగా భావిస్తున్నాన‌ని షర్మిల పేర్కొన్నారు.

"నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా T-SAVE ద్వారా పోరాటం చేద్దాం. రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని వైఎస్సార్టీపీ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల పిలుపునిచ్చారు. అఖిలపక్ష కార్యాచరణ కమిటీ (ఏపీఏసీ) వేదికను నడిపిస్తుందనీ, పోరాటానికి తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్ నేతృత్వం వహించాల‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం చేశారు. "మ‌ననమందరం తమదైన శైలిలో పోరాడుతున్నామని, అయితే ఈ క్రూరమైన ప్రభుత్వాన్ని వ్య‌తిరేకంగా, మన  బిడ్డ‌ల‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేయడానికి, వీటిని సాధించ‌డానికి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలిపారు.


 

 

ఈ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ నియంత పాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేండ్లుగా అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పోరాడాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు. దీని కోసం T-SAVE(Telangana Students Action For Vacancies & Employment) అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్న‌ట్టు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?