భద్రాద్రి జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడి తల్లి

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 1:01 PM IST
Highlights

భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు‌ మండలం సారపాకలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన కొడుకు మోసం చేశాడని ఓ యువతి ఇంటి ముందు ధర్నా చేయడాన్ని అవమానంగా భావించిన మహిళ పురుగుల మందు తాగింది. 

భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు‌ మండలం సారపాకలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన కొడుకు మోసం చేశాడని ఓ యువతి ఇంటి ముందు ధర్నా చేయడాన్ని అవమానంగా భావించిన మహిళ పురుగుల మందు తాగింది. వివరాలు.. సారపాకలో కిరణ్ అనే యువకుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. కిరణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని  ఆరోపిస్తూ యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే యువతి, ఆమె బంధువులు కిరణ్ ఇంటి ముందు బైఠాయించారు. 

అయితే యువతి, ఆమె బంధువులు తమ ఇంటి ముందు ధర్నా చేయడాన్ని కిరణ్ తల్లి జ్యోతి అవమానంగా భావించింది. ఈ క్రమంలోనే జ్యోతి పురుగుల మందు తాగింది. దీంతో జ్యోతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

click me!