శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Published : Dec 23, 2018, 04:46 PM IST
శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టడానికని మానవహిల్స్  క్వారీ గుంత వద్దకు వెళ్లారు. అయితే ఇందులో ముగ్గురు యువకులు ఈత కొట్టడానికి నీళ్లలో దిగి మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన యువకులు భార్గవ్,  సూర్య, చంద్ర లుగా గుర్తించారు. భార్గవ్, సూర్యలు సొంత అన్నదమ్ముళ్లు. 

ఈ  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం క్వారీ గుంతలో గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?