శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Published : Dec 23, 2018, 04:46 PM IST
శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టడానికని మానవహిల్స్  క్వారీ గుంత వద్దకు వెళ్లారు. అయితే ఇందులో ముగ్గురు యువకులు ఈత కొట్టడానికి నీళ్లలో దిగి మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన యువకులు భార్గవ్,  సూర్య, చంద్ర లుగా గుర్తించారు. భార్గవ్, సూర్యలు సొంత అన్నదమ్ముళ్లు. 

ఈ  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం క్వారీ గుంతలో గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu