షిరిడి రైలులో మహిళా దొంగల హల్ చల్.. 9మంది కిలేడీల అరెస్ట్...

Published : Jul 13, 2023, 08:12 AM IST
షిరిడి రైలులో మహిళా దొంగల హల్ చల్.. 9మంది కిలేడీల అరెస్ట్...

సారాంశం

షిర్డీ రైలులో 9మంది మహిళా దొంగలు కలకలం సృష్టించారు. ఎస్ 1 భోగీ నుంచి ఎస్ 10 భోగీ వరకు తిరుగుతూ లగేజీ, నగలు దోచుకున్నారు కిలేడీలు.

నిజామాబాద్ : షిరిడి రైలులో మహిళా దొంగలు హల్ చల్ సృష్టించారు.నిజామాబాద్ జిల్లా నవీపేటలో క్రాసింగ్ పెట్టడంతో రైలు ఆగింది. ఆ సమయంలో రైలులోకి 9 మంది యువతులు చేరారు. ప్రయాణికుల బ్యాగులు మాయం చేశారు. ఎస్ 1 నుంచి ఎస్ 10 భోగీ వరకు తిరుగుతూ హల్ చల్ చేశారు. ప్రయాణికుల బ్యాగులు, మహిళ మెడలోని చైన్లను మాయం చేశారు. 

ఆ తరువాత బాసర దగ్గర చైన్ లాగి పారిపోయేందుకు ప్రయాణించారు. ఇది గమనించిన ప్రయాణికులు వారిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో 9 మంది యువతులు ఉన్నారు. ఈ మహిళలను మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్