కాజీపేటలో ర్యాష్ డ్రైవింగ్ : మహిళ స్పాట్ డెడ్, కారులో ఎక్స్‌జ్ సీఐ కొడుకు .. ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు

Siva Kodati |  
Published : Dec 01, 2023, 04:12 PM IST
కాజీపేటలో ర్యాష్ డ్రైవింగ్ : మహిళ స్పాట్ డెడ్, కారులో ఎక్స్‌జ్ సీఐ కొడుకు .. ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు

సారాంశం

ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?