మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్(2) ను హత్య చేసింది.
కడుపున పుట్టిన కొడుకును కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లే.. అతి కిరాతకంగా ప్రవర్తించింది. కన్న కుమారుడిని అతి దారుణంగా చంపేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చేవెళ్ల మండలం రామన్నగూడ గ్రామంలో ఓ మహిళ తాగిన మత్తులో కన్న బిడ్డనే గొంతునులిమి చంపేసింది. మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్(2) ను హత్య చేసింది. మద్యం తాగొద్దని ఆమె మామ మందలించడంతో ఆగ్రహానికి గురైన మహిళ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.
వెంటనే కుటుంబసభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.