వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి

Published : Feb 03, 2021, 10:36 AM IST
వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి

సారాంశం

వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.జిల్లాలోని ధరూర్ మండలంలోని దోర్నాల్  గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ వ్యాధి పక్కనే ఉన్న మరో మండలానికి పాకింది.  ఈ విషయమై స్థానికులు  అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఇదే గ్రామంలో జంతు కళేబరాలతో ఆయల్ తయారీ చేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ  కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.  వ్యాధికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

పెద్ద ఎత్తున పక్షులు మరణించడంతో స్థానికులు  ఆందోళనగా ఉన్నారు.  ఏ కారణం చేత పక్షులు మరణిస్తున్నాయో అంతు బట్టడం లేదంటున్నారు. పక్క మండలానికి కూడ వెంటనే ఈ వ్యాధి ప్రబలడంతో  ఆ మండలానికి  చెందిన ప్రజలు కూడ ఆందోళ చెందుతున్నారు. 

స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు.  పశుసంవర్థక శాఖ అధికారులు  చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu