వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి

Published : Feb 03, 2021, 10:36 AM IST
వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి

సారాంశం

వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.జిల్లాలోని ధరూర్ మండలంలోని దోర్నాల్  గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ వ్యాధి పక్కనే ఉన్న మరో మండలానికి పాకింది.  ఈ విషయమై స్థానికులు  అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఇదే గ్రామంలో జంతు కళేబరాలతో ఆయల్ తయారీ చేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ  కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.  వ్యాధికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

పెద్ద ఎత్తున పక్షులు మరణించడంతో స్థానికులు  ఆందోళనగా ఉన్నారు.  ఏ కారణం చేత పక్షులు మరణిస్తున్నాయో అంతు బట్టడం లేదంటున్నారు. పక్క మండలానికి కూడ వెంటనే ఈ వ్యాధి ప్రబలడంతో  ఆ మండలానికి  చెందిన ప్రజలు కూడ ఆందోళ చెందుతున్నారు. 

స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు.  పశుసంవర్థక శాఖ అధికారులు  చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్