బంగారం కోసం బాలానగర్‌లో దారుణం: మహిళను చంపి, ముక్కలుగా కట్ చేసి.. ఆపై కాల్చేసి

Siva Kodati |  
Published : Dec 27, 2022, 04:51 PM IST
బంగారం కోసం బాలానగర్‌లో దారుణం: మహిళను చంపి, ముక్కలుగా కట్ చేసి.. ఆపై కాల్చేసి

సారాంశం

హైదరాబాద్ బాలానగర్‌లో గత నెల 27న అదృశ్యమైన బొర్ర బాలమ్మ అనే మహిళ దారుణహత్యకు గురైంది. ఆమె ఒంటిపై వున్న బంగారం కోసం దారుణంగా చంపి, ముక్కలుగా కట్ చేసి తగులబెట్టేశారు దుండగులు. 

హైదరాబాద్ బాలాపూర్‌లో దారుణం జరిగింది. గత నెల 27న అదృశ్యమైన బొర్ర బాలమ్మ దారుణహత్యకు గురైంది. బాలమ్మను చంపి విడిభాగాలుగా చేసి ఆపై ఆమెను తగులబెట్టారు దుండగులు. అనంతరం ఆ బూడిదను కాలువలో కలిపేశారు. బాలమ్మ ఒంటిపై వున్న నగలను దోచుకున్నారు దుండగులు. బాలమ్మను చంపిన వారిని రాములు, లలితగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 తులాల బంగారం, 159 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu