మహిళ మెడలో బంగారం చోరీ చేసి.. హత్య..!

Published : Feb 19, 2021, 09:42 AM ISTUpdated : Feb 19, 2021, 09:47 AM IST
మహిళ మెడలో బంగారం చోరీ చేసి.. హత్య..!

సారాంశం

ఈ నెల 9వ తేదీన మహిళ ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిి రాలేదు. మృతురాలి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఈ నెల 10న నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కౌకూర్ అటవీ ప్రాంతంలో దొరికిన మహిళ మృతదేహం కేసు మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి డీసీపీ ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నేరేడ్ మెట్ పరిధిలోని వినోభానగర్ కు చెందిన చంద్రకళ(43) మృతదేహాన్ని బుధవారం కౌకూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.

ఈ నెల 9వ తేదీన మహిళ ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిి రాలేదు. మృతురాలి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఈ నెల 10న నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన పిక్కలి సురేష్(28) ను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె ఒంటి పై బంగారం, వెండి ఆభరణాలను అపహరించడంతోపాటు.. ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. చంద్రకళకు పని ఇప్పిస్తానని నమ్మించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu