కొత్త మంత్రులకు శుభాకాంక్షల వెల్లువ...

First Published Feb 20, 2019, 5:06 PM IST

తెలంగాణ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం విస్తరించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేసేందుకు ఈ విస్తరణ ద్వారా మరికొందరికి అవకాశం వచ్చింది. ఇలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువ మొదలయ్యింది. మంత్రులను మర్యాదపూర్వకంగా కలవడానికి వారి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. ఇలా నూతన మంత్రులు బిజీబిజీగా గడుపుతున్నారు.

తెలంగాణ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం విస్తరించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేసేందుకు ఈ విస్తరణ ద్వారా మరికొందరికి అవకాశం వచ్చింది. ఇలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువ మొదలయ్యింది. మంత్రులను మర్యాదపూర్వకంగా కలవడానికి వారి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. ఇలా నూతన మంత్రులు బిజీబిజీగా గడుపుతున్నారు.
undefined
ఇవాళ హైదరాబాద్‌లోని మినిస్టర్ క్యాంపు ఆఫీసులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పలువురు ప్రభుత్వ అధికారులు కలిశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలపారు.
undefined
నూతనంగా రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా నియమితులైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలువురు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసం వద్ద నాయకులు,కార్యయకర్తల తాకిడి పెరిగింది. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పరకాల ఎమ్మల్యే చల్లా ధర్మారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, నార్త్ జోన్ ట్రాఫిక్ డిసిపి రాధాకిషన్ తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, అభిమానులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు, పూలమాలలతో తలసానిని సన్మానించారు.
undefined
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తో సమావేశయయ్యారు. ఈ సవదర్భంగా వీరిద్దరు మొదటిసారి మంత్రిగా నియమితులైన ప్రశాంత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
undefined
రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలసిన వారిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ జా, ఇతర సీనియర్ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, యాదగిరిగుట్ట ఈఓ గీత,ధర్మపురి ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వేములవాడ ఈఓ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
undefined
click me!