వివాహేతర సంబంధం...సుఫారీ ఇచ్చిమరీ భర్తను చంపించిన భార్య

Published : Mar 09, 2019, 08:56 PM ISTUpdated : Mar 09, 2019, 09:05 PM IST
వివాహేతర సంబంధం...సుఫారీ ఇచ్చిమరీ భర్తను చంపించిన భార్య

సారాంశం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్తను కిరాయి హంతకుడికి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది.  

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్తను కిరాయి హంతకుడికి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు-నాగమణి భార్యా భర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఇతడు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్స్ లో స్టాళ్లను ఏర్పాటుచేసుకుని వస్తువులను విక్రయిస్తుంటాడు. దీంతో భార్యా, పిల్లతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. 

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన కన్నా అనే వ్యక్తితో నాగమణికి పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భార్య ప్రవర్తనలో మార్పు అనుమానం వచ్చిన నాగేశ్వరరావు ఆమెపై ఓ కన్నేసి వుంచగా అక్రమసంబంధం గురించి బయటపడింది. 

దీంతో అతడు భార్యతో పాటు ఆమె ప్రియుడు కన్నా తీవ్రంగా హెచ్చరించాడు. అంతేకాకుండా ఆమెను తరచూ ఈ విషయం కారణంగా వేధించేవాడు. దీంతో నాగమణికి దారుణమైన ఆలోచన వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని పథక రచన చేసింది. 

ఓ కిరాయి హంతకుడిలో నాగమణి ఆము ప్రియుడు కలిసి నాగేశ్వరరావు హత్య కోసం 50వేలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేధీన మద్యం మత్తులో వున్న నాగేశ్వరరావుపై కిరాయి హంతకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. 

అయితే ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతుడి భార్యపైనే అనుమానం వచ్చింది. దీంతో ఆమెను విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు, కిరాయి హంతకుడిని అరెస్ట్ చేశారు.    

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?