Revanth Reddy: కేసీఆర్‌కు జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు, రూ.4 వేల పింఛను ఇస్తాం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

Published : Nov 24, 2023, 12:31 PM IST
Revanth Reddy: కేసీఆర్‌కు జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు, రూ.4 వేల పింఛను ఇస్తాం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

సారాంశం

Telangana Congress: కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌ ప్రస్తుతం ఇస్తున్న రూ.2,016 వృద్ధాప్య పింఛను రూ.4,000కు పెంచుతుందని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థులను టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా నియమించిందనీ, ఫలితంగా పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు జిరాక్స్ షాపుల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.  

Telangana Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రోసారి అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపుపై ధీమా వ్య‌క్తి చేసిన రేవంత్.. కాగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు వృద్ధాప్య పింఛను రూ.4వేలు అందజేస్తామనీ, చర్లపల్లి సెంట్రల్ జైలులో ఆయనకు 2బీహెచ్‌కే ఇంటిని నిర్మిస్తామంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ ప్రస్తుతం ఇస్తున్న రూ.2,016 వృద్ధాప్య పింఛను రూ.4,000కు పెంచుతుందని రేవంత్ ఉద్ఘాటించారు. పేదలకు 2బిహెచ్‌కె గృహాలను అందజేస్తామని కేసీఆర్ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. "కేసీఆర్ వచ్చే నెలలో పదవీ విరమణ చేస్తున్నారు.. కాంగ్రెస్ రూ. 4,000 పెన్షన్ ఇస్తుందనే విషయం కూడా ఆయన తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో ఇందిరమ్మ రాజ్యం 2బీహెచ్‌కే ఇల్లు కట్టిస్తుంద‌ని" అని వ్యాఖ్యానించారు.

దుబ్బాక, హుజూరాబాద్‌, మానకొండూర్‌, ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నిరుద్యోగభృతి, టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థులను టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా నియమించిందనీ, ఫలితంగా పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు జిరాక్స్ షాపుల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. మానకొండూర్‌లో, స్థానిక ఎమ్మెల్యే, ప్రముఖ తెలంగాణ జానపద, విప్లవ గాయకుడు రసమయి బాలకిషన్‌ "తెలంగాణ ప్రతిఘటన గీతాన్ని" భూస్వామ్య భూస్వామికి (కేసీఆర్) తాకట్టు పెట్టారని ఆరోపించారు.

“పిల్లి స్థలం మార్చుకున్నట్లుగా కేసీఆర్ తన నియోజకవర్గాన్ని గజ్వేల్ నుండి కామారెడ్డికి మార్చారు. కానీ కేసీఆర్ నకిలీ 100 నోటు లాంటివాడు, అది ప్రజల జేబుల్లో ఉన్నప్పటికీ విలువ లేదు” అని రేవంత్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన 12 మంది ఎమ్మెల్యేలను ఈసారి మళ్లీ గెలిపించకుండా చూస్తామన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఎందుకు మంజూరు చేయించ‌లేక పోయార‌ని ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత| Asianet News Telugu
Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?