వేలల్లో కరెంట్ బిల్లులు: సిబ్బందిని అడ్డుకున్న షాద్‌నగర్ వాసులు

Siva Kodati |  
Published : Jun 05, 2020, 06:25 PM IST
వేలల్లో కరెంట్ బిల్లులు: సిబ్బందిని అడ్డుకున్న షాద్‌నగర్ వాసులు

సారాంశం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు గ్రామస్తులు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 నుంచి రూ.400 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేదని.. కానీ ఈ నెల మాత్రం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు బిల్లు వచ్చిందని వాపోయారు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు గ్రామస్తులు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 నుంచి రూ.400 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేదని.. కానీ ఈ నెల మాత్రం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు బిల్లు వచ్చిందని వాపోయారు.

కాయకష్టం చేసుకుని బతికే తమకు వేలల్లో బిల్లులు వస్తే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని నిలదీశారు. లాక్‌డౌన్ సమయంలో బతికేందుకే కష్టంగా వుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తమ షాపులు మూసివేసినప్పటికీ ఇంత బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం