విజయ్ భేరి పాదయాత్ర: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్రచారంలో పాల్గొన‌నున్న‌ రాహుల్, ప్రియాంక గాంధీ

Published : Oct 16, 2023, 03:09 PM IST
విజయ్ భేరి పాదయాత్ర: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్రచారంలో పాల్గొన‌నున్న‌ రాహుల్, ప్రియాంక గాంధీ

సారాంశం

Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు ప్రచారం ముమ్మ‌రం చేశాయి. విజయ్ భేరి పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్రచారాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రారంభించున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అక్టోబర్ 18న ప్రఖ్యాత రామప్ప మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారం ప్రారంభం కానుంది.   

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మ‌రం చేస్తోంది. మూడు రోజుల్లో ఐదు జిల్లాల్లో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ర్యాలీల్లో పాల్గొంటారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ములుగు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత రామప్ప మందిరంలో ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ప్రచారం ప్రారంభమవుతుంది. తెలంగాణ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు ఠాక్రే, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచార వివరాలను వెల్లడించారు.

ప్రారంభోత్సవం రోజున భూపాలపల్లిలో జరిగే మహిళా ర్యాలీలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. ఈ ర్యాలీకి "విజయ్ భేరి పాదయాత్ర" గా నామ‌క‌ర‌ణం చేశారు. మహిళల ర్యాలీ అనంతరం ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్ల‌నుండగా, రాహుల్ గాంధీ మరో రెండు రోజుల పాటు తన పర్యటనను కొనసాగించనున్నారు. ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లా ములుగు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించి అనంతరం రామగుండంలో సంగారెడ్డి కాలరీస్ ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. పెద్దపల్లిలో బహిరంగ సభలో పాల్గొని వరి ధాన్యం అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక రైతులతో చర్చించనున్నారు.

సాయంత్రం కరీంనగర్ లో జరిగే పాదయాత్ర, బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అదే రోజు జగిత్యాల, బోధన్, ఆర్మూర్లలో ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన వివిధ రంగాల కార్మికుల కుటుంబాలను, వ్యక్తులను కలుస్తారు. బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ఆర్మూర్ లోని చక్కెర, పసుపు రైతులను కలవనున్నారు. నిజామాబాద్ టౌన్ లో జరిగే బహిరంగ సభతో రోజు ముగుస్తుంది. దసరా పండుగ తర్వాత రెండో దశ ప్రచారం జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు కాగానే మూడో విడత ప్రచారంలో జాతీయ నేతలు పాల్గొంటారు. ఈ సారి ఎన్నిక‌ల్లో తెలంగాణలో గణనీయమైన ప్రభావం చూపాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పీఠ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu