వరవరరావు అరెస్ట్.... ట్యాంక్ బండ్ పై ప్రజాసంఘాల నిరసన

Published : Aug 29, 2018, 03:05 PM ISTUpdated : Sep 09, 2018, 11:10 AM IST
వరవరరావు అరెస్ట్.... ట్యాంక్ బండ్ పై ప్రజాసంఘాల నిరసన

సారాంశం

ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అనుమానంతో విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావును మహారాష్ట్ర పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటితో పాటు కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మహారాష్ట్రకు తరలించారు. 

ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, ఈ కుట్రతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ  విప్లవ రచయిత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతుళ్ల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే మరికొంత మంది ఇళ్లలో కూడా సోదాలు చేసిన పోలీసులు చివరకు వరవరరావును అరెస్ట్ చేయడం జరిగింది.

ఆదారాలు లేకుండా విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి.  ఇందుకు నిరసనగా ఇవాళ ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, విప్లవ నాయకులు, తెలంగాణ వాదులు నిరసనకు దిగాయి.

దీంతో పోలీసులు ఈ నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రజా సంఘాల నాయకులు సంధ్య,రవిచంద్ర, లక్ష్మణ్, కోటి, ఉష, గీతాంజలిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  
  

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?