తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

By narsimha lodeFirst Published Jan 24, 2022, 4:10 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనందునే ఆలస్యం అవుతున్నాయని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు కేంద్ర మంత్రి Kishan Reddy సోమవారం నాడు లేఖ రాశారు. రాష్ట్రంలో అమలౌతున్న రైల్వే ప్రాజెక్టు లకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్లే ఆలస్యం అవుతుందని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Railway ప్రాజెక్టు ల విషయంలో తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని  కిషన్ రెడ్డి  ప్రకటించారు.2014 - 15 లో రూ. 250 కోట్లు ఉన్న బడ్జెట్ 2021- 22లో  రూ.2420 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. Telangana కు కేంద్రం కేటాయించిన నిధులను లేక్కల తో సహా లేఖలో  కిషన్ రెడ్డి ప్రస్తావించారు.


 

click me!