పటేల్ స్పూర్తితో పనిచేస్తున్నాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 8, 2019, 1:57 PM IST
Highlights

సర్ధార్ పటేల్ స్పూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైద్రాబాద్‌కు వచ్చారు.  


హైదరాబాద్:  సర్ధార్ పటేల్ స్పూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైద్రాబాద్‌కు వచ్చారు.  హైద్రాబాద్‌కు  వచ్చిన కిషన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

హైద్రాబాద్‌కు వచ్చిన జి. కిషన్ రెడ్డి అసెంబ్లీకి ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నేరుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలకు కిషన్ రెడ్డి వెళ్లారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పటేల్ స్పూర్తి నుండి పొందాలని ఆయనకు నివాళులర్పించినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. 
 

.  

click me!