తెలంగాణ వర్షాలు : అమిత్ షా తెలంగాణ పర్యటన .. మరోసారి వాయిదా , తీవ్ర నిరాశలో బీజేపీ శ్రేణులు

Siva Kodati |  
Published : Jul 27, 2023, 06:04 PM IST
తెలంగాణ వర్షాలు : అమిత్ షా తెలంగాణ పర్యటన .. మరోసారి వాయిదా , తీవ్ర నిరాశలో బీజేపీ శ్రేణులు

సారాంశం

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. 

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఆయన తెలంగాణ పర్యటనకు రావాల్సి వుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామని బీజేపీ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్‌లో నోవాటెల్‌కు చేరుకుని.. రాత్రి 8 గంటల వరకు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !