యువతిపై కన్నేసిన బాబాయి, అన్న.. లైంగికంగా వేధిస్తూ..

By telugu news teamFirst Published Aug 17, 2021, 8:16 AM IST
Highlights

ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపించేశారు.  పెద్దమ్మ, పెదనాన్నల వద్ద పెరుగుతున్న యువతి పదో తరగతి వరకు చదువుకుంది.

ఆమె  చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో.. ఆమెను పెద్దమ్మ, పెదనాన్నలు సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఆమెతోపాటే.. పెరిగిన పెదనాన్న కొడుకు..ఇప్పుడు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించడం గమనార్హం. అన్న తో పాటు... చిన్నాన్న కూడా ఆమెపై కన్నేసి.. లైంగికంగా వేధించారు. దీంతో.. వారి వేధింపులు తాళలేక బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంగటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేరేడుచర్ల మండలం ఫత్తేపురానికి చెందిన ఓ యువతి(21) కి రెండేళ్ల వయసులో నే తల్లిదండ్రులు మరణించారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా.. ఈ యువతిని పెద్దమ్మ, పెదనాన్నలు పెంచి పెద్ద చేశారు. మరో బాలికను వేరే ఎవరికో దత్తత ఇచ్చారు. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపించేశారు.  పెద్దమ్మ, పెదనాన్నల వద్ద పెరుగుతున్న యువతి పదో తరగతి వరకు చదువుకుంది.

ఆ తర్వాత చదువు మాన్పించి ఇంటి పనులు, కూలి పనులకు పంపించేవారు. ఈ క్రమంలోనే యువతిపై ఆమె  చిన్నాన్న కన్ను పడింది. తన తండ్రి సొంత తమ్ముడే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో... ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు.  ఆ తర్వాత పెదనాన్న కుమారుడు కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో... వాటిని భరించలేక యువతి పురుగుల మందు తాగింది.

చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది,  లైంగిక వేధింపులు తాళలేకే యువతి చనిపోయినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.   పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, 

click me!