కారులో చెలరేగిన మంటలు: ఇద్దరు సజీవ దహనం

Published : Feb 20, 2019, 12:49 PM ISTUpdated : Feb 20, 2019, 01:24 PM IST
కారులో చెలరేగిన మంటలు: ఇద్దరు సజీవ దహనం

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో  మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో  మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అవుటర్ రింగ్ రోడ్డులోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్దకు కారు రాగానే మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే  ఈ కారులో  మంటలు వ్యాపించడానికి కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Ration Card: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేష‌న్ కార్డు ఉన్న వారు ఇకపై నెల‌నెలా లైన్‌లో నిల‌బ‌డాల్సిన ప‌నిలేదు
IMD Rain Alert: ఉరుములు, మెరుపులు, వ‌డ‌గండ్ల వాన‌లు.. వ‌చ్చే 24 గంట‌లు అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం