రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు బ్యాంక్ ఉద్యోగుల మృతి

Published : Jan 03, 2019, 11:47 AM ISTUpdated : Jan 03, 2019, 12:31 PM IST
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు బ్యాంక్ ఉద్యోగుల మృతి

సారాంశం

లంగర్‌హౌస్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. 


లంగర్‌హౌస్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. పిల్లర్‌ నంబర్‌ 102 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను నానక్‌రామ్‌గూడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే దీపికా నిఖిల్‌, షాబాజ్ హైమద్ ఖాన్ గా గుర్తించారు.  వీరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy