ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్తకు కరోనా: ఆఫీస్ మూసేశాం, ఎవరూ రావొద్దంటూ ట్వీట్

By Siva KodatiFirst Published Mar 24, 2021, 9:55 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌ కోవిడ్ బారినపడ్డారు. ఆయన చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కవితనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా క్వారంటైన్‌లో ఉందని, ఇతరులెవరూ తమను కలిసేందుకు రావొద్దని కవిత ట్వీట్  చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌ కోవిడ్ బారినపడ్డారు. ఆయన చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కవితనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా క్వారంటైన్‌లో ఉందని, ఇతరులెవరూ తమను కలిసేందుకు రావొద్దని కవిత ట్వీట్  చేశారు. 

‘‘నా భర్త అనిల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన మా కుటుంబంతా క్వారంటైన్‌లోనే ఉంది. ఇప్పట్లో మమ్మల్నెవరూ కలిసేందుకు వీలు లేదు. ఆఫీసు కూడా మూసివేశామని కవిత వెల్లడించారు. క్వారంటైన్ నిబంధనలు ముగిసి పరిస్థితులు చక్కబడ్డాక ఆఫీసు తెరుచుకుంటుందని కవిత ట్వీట్ చేశారు.

 

My husband Anil garu has tested positive for . He is under home quarentine and is doing well. My family and I have quarantined ourselves and would not be making any public or personal appearances. My office will reschedule all the meetings to avoid inconvenience.

— Kavitha Kalvakuntla (@RaoKavitha)
click me!