తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం ప్రచారాన్ని మొత్తం తమ భుజాలపై వేసుకుని అభ్యర్థులను గెలిపించుకున్నారని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించేకునే బాధ్యత తీసుకున్న ఎంపి కవిత సఫలీకృతమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలుపొందారు. దీంతో తమ గెలుపు కోసం కృషి చేసిన కవితను కలుసుకోవడానికి ఎమ్మెల్యేలంతా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు.