తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 89వేల 009 ఓట్లు మెజారిటీని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ఇదే అత్యంత పెద్దదన్నారు. అలాగే తనకు ఇచ్చిన మెజారిటీకి తగ్గట్లుగానే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Actually just got informed that the majority is 89,009 🎉 https://t.co/M4tIlKbA9z
— KTR (@KTRTRS)