అక్రమ సంబంధాలపై యువకులకు మందలింపు: టీఆర్ఎస్ నేత దారుణ హత్య

By telugu news teamFirst Published Jun 15, 2021, 11:51 AM IST
Highlights


వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయతీలో మందలించాడనే కారణంతో కక్ష పెంచుకొని.. మరొకందరి సహకారంతో శంకర్ నాయక్ ని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 

టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు.  సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ నాయక్ ని దారుణంగా హత్య చేశారు. కాగా.. ఈ హత్యకేసు వెనక ఉన్న చిక్కుముడిని పోలీసులు దాదాపు చేధించినట్లు తెలుస్తోంది.

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయతీలో మందలించాడనే కారణంతో కక్ష పెంచుకొని.. మరొకందరి సహకారంతో శంకర్ నాయక్ ని హత్య చేసినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శంకర్ నాయక్.. ఉన్నత విద్యావంతుడు. ఎల్ఎల్బీ పూర్తి చేసి గ్రామంలోనే వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. మూడేళ్లుగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శంకర్ నాయక్ అందరితో కలివిడిగా ఉంటూ.. గ్రామ సమస్యలు తీర్చడంలో సహాయం చేస్తూ ఉండేవాడు.

కాగా.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రా మానికి చెందిన ఇద్దరు మహిళలతో కొంతకాలంగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, వీరి వివాదం రెండు మాసాల క్రితం పంచాయితీ పెద్దల వరకు వచ్చింది. అయితే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటున్న శంకర్‌నాయక్‌ వివాహేతర సంబంధాలు సాగిస్తున్న సదరు యువకులను పంచాయితీలో అందరిముందు మీరు అనుసరిస్తున్న తీరు తప్పని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు జరిగిన పంచాయితీలో సైతం శంకర్‌నాయక్‌ ఆ యువకులను తప్పుబట్టడడంతోనే కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో.. వీరే పథకం ప్రకారం.. శంకర్ నాయక్ ని అంతమొందించినట్లు సమాచారం. తన సోదరుడి ఇంటికి వెళ్లి వస్తున్న శంకర్ నాయక్ ని గమనించి.. దుండగులు హత్య చేశారు. కాగా.. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

click me!