శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు: ఒకే వేదికపై వెంకటేశ్, మహేశ్‌బాబు

Siva Kodati |  
Published : Jan 09, 2020, 05:42 PM ISTUpdated : Jan 09, 2020, 05:44 PM IST
శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు: ఒకే వేదికపై వెంకటేశ్, మహేశ్‌బాబు

సారాంశం

హైదరాబాద్ శిల్పకళావేదికలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

హైదరాబాద్ శిల్పకళావేదికలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

ఆయనతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Also Read:మహేష్ బాబుకి జగన్ ఆఫర్..!

ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగు రంగుల రంగవల్లులు, హరిదాసులు, జంగందేవరలు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల విన్యాసాలు సందర్శకులను అలరిస్తున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం'సరిలేరు నీకెవ్వరు; ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

ఈ సినిమా ప్రత్యేకషోలు వేసుకోవడానికి అనుమతినిచ్చింది. అదనపు షోల కోసం చిత్రనిర్మాత అనీల్ సుంకర ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లెటర్ రాశారు. ఈ లేఖని పరిశీలించిన జగన్ ప్రభుత్వం స్పెషల్ షోలు వేసుకోవడానికి అంగీకరించింది.

Also Read:కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో థియేటర్ యజమానులు..  తెల్లవారుజామున గం.1 నుంచి గం.10ల మధ్యలో రెండు షోలను ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే రోజుకి ఆరు షోలు వేస్తారు.

ఇది సూపర్ స్టార్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu